భాగవతం
భాగవతం -- 1
వ్యాసభగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ సామాన్యమయినది కాదు. ఆయన మహోత్కృష్టమయిన సేవ చేశారు. చేసి అంతటితో ఊరుకోలేదు. అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామములయందు మాత్రమే తగిలి ఉండే సామాన్య జనులు కలియుగంలో వేదములను నాలుగింటిని చదవడం దుస్సాధ్యమనే బుద్ధిచేత వ్యాసభగవానుడు వేదరాశిని నాలుగుగా విభాగం చేశారు. ఆయన వేదరాశినంతటిని నాలుగు భాగములుగా విభాగం చేశారు. అవి :-
వ్యాసభగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ సామాన్యమయినది కాదు. ఆయన మహోత్కృష్టమయిన సేవ చేశారు. చేసి అంతటితో ఊరుకోలేదు. అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామములయందు మాత్రమే తగిలి ఉండే సామాన్య జనులు కలియుగంలో వేదములను నాలుగింటిని చదవడం దుస్సాధ్యమనే బుద్ధిచేత వ్యాసభగవానుడు వేదరాశిని నాలుగుగా విభాగం చేశారు. ఆయన వేదరాశినంతటిని నాలుగు భాగములుగా విభాగం చేశారు. అవి :-
1. ఋగ్వేదము,
2. యజుర్వేదము,
3. సామవేదము,
4. అధర్వణవేదము
వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసిన విధి విధానములు గురించి, మనం ఆచరించిన విధి విధానముల వలన మనం పొందే ఇహలౌకిక పరలౌకిక సౌఖ్యములను గూర్చి వివరిస్తుంది. ఉత్తరభాగం అంతాకూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇదే తుట్టతుద జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయడం చేత మనకు కైవల్యం లభిస్తుందో దానిని గురించి తెలియజేస్తుంది.
|| ‘జ్ఞానాత్ కేవల కైవల్యం’ ||
జ్ఞానం చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది.
జ్ఞానం చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది.
పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానమును మనం పొందాలో అటువంటి జ్ఞానమును వేదము ఉత్తరభాగం ప్రతిపాదన చేస్తుంది. ఆయన తన శిష్యుడయిన జైమిని చేత వెతమునకు పూర్వభాగమయిన కర్మకు సంబంధించిన, విషయములన్నిటికి వ్యాఖ్యానం చేయించారు. దానిని ‘పూర్వమీమాంస’ అంటారు. ఉత్తరభాగమంతా జ్ఞానమునకు సంబంధించినది. వ్యాసమహర్షియే స్వయంగా బ్రహ్మసూత్రములను రచించారు. ఈ బ్రహ్మసూత్రములనే ‘ఉత్తరమీమాంస’ అని కూడా అంటారు. మరల ఆయన పదునెనిమిది పురాణములను రచించారు. పురాణములను రచించడం అంటే తేలికయిన పనికాదు.
‘సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ !
వంశానుచరితం చైవ పురాణం పంచ లక్షణం !!
పురాణమునకు ఐదు లక్షణములు ఉండాలి. సర్గ, ప్రతిసర్గ అని విభాగం ఉండాలి. గొప్పగొప్ప వంశములను గురించి ప్రస్తావన చేయాలి. అనేక మన్వంతరములలో జరిగిన విశేషములను చెప్పాలి. అది భగవత్సంబంధంగా దానిని ప్రతిపాదన చేయకలిగిన శక్తి ఉండాలి. అటువంటి వాడు తప్ప పురాణమును చెప్పలేదు. అటువంటి పురాణములను రచించిన మహానుభావుడు వేదవ్యాసుడు. మనకి జ్ఞాపకం ఉండడం కోసమని తేలిక సూత్రమునొకదానిని పెద్దలు ప్రతిపాదించారు.
‘మ’ద్వయం ‘భ’ద్వయం చైవ ‘బ్ర’త్రయం ‘వ’చతుష్టయం!!
‘అ’ ‘నా’ ‘ప’ ‘లిం’ ‘గ’ ‘కూ’ స్కా’ని పురాణాని పృథక్ పృథక్!! (దేవీభాగవతం 1-3-21)
మ ద్వయం – ‘మ’కారం తో రెండు పురాణములు ప్రారంభంఅవుతాయి. అందులో ఒకటి మార్కండేయ పురాణము, రెండవది మత్స్య పురాణము.
భ ద్వయం – ‘భ’కారం తో రెండు పురాణములు ప్రారంభమవుతాయి. అందులో ఒకటి భాగవత పురాణము, రెండవది భవిష్య పురాణము.
బ్ర త్రయం – ‘బ్ర’కారంతో మూడు పురాణములు ప్రారంభమవుతాయి. అందులో ఒకటి బ్రహ్మ పురాణము, రెండవది బ్రహ్మాండ పురాణము, మూడవది బ్రహ్మవైవర్త పురాణము.
వ చతుష్టయం – ‘వ’కారంతో నాలుగు పురాణములు ప్రారంభమవుతాయి. అందులో ఒకి వరాహపురాణము, రెండవది విష్ణు పురాణము, మూడవది వామన పురాణము, నాలుగవది వాయు పురాణము.
అనాపలింగకూస్కాని – అన్నప్పుడు ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పురాణం వస్తుంది.
🔹 అ – అగ్నిపురాణం.
🔹 నా – నారద పురాణం.
🔹 ప – పద్మ పురాణం.
🔹 లిం – లింగపురాణం.
🔹 గ – గరుడ పురాణం.
🔹 కూ – కూర్మపురాణం.
🔹 స్కా – స్కాందపురాణం.
వ్యాసభగవానులు వేదములను విభాగం చేసినప్పుడు ఒక్కొక్క వేదమును ఒక్కక్క శిష్యుడికి అప్పచెప్పారు. వ్యాసుడు చేసిన సేవ అంతా ఇంతా కాదు.
🙏🙏 !! ఓం నమో భగవతే వాసుదేవాయ !! 🙏🙏

No comments:
Post a Comment